☝️★★★★★★★★☝️
🎭
💥 *తెలుగు*💥
*నాటకరంగ వైభవం*
★★★★★★★★★★
ఈనాటి మన చిరస్మరణీయులు *శ్రీ దైతా గోపాలం*
రంగస్థల, సినీ నటులు, రచయిత..
వీరు కృష్ణా జిల్లా..శ్రీకాకుళం గ్రామం శివార్ల లో ఉన్న పాపనాశనం లో 1900 వ సం:లోజన్మించారు
తెలుగు నాటకరంగం, మరచిపోలేని మేటి కళాకారుడు. ఈయన అనేక నాటకాలు ఆడారు. అచ్యుత రామశాస్త్రి రచించిన 'సక్కుబాయి' నాటకాన్ని దైతా గోపాలం తన సొంత పాటలతో దర్శకత్వంతో నడిపించారు. సుప్రసిద్ధ చిత్రసంగీత
దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావుకు సక్కుబాయి పాత్రను నేర్పి చాలాసార్లు ప్రదర్శించారు.
మైలవరం కంపెనీ లూ పూర్తి నాటక సభ్యులు గా వున్నారు. నాటకాల్లోనేకాక సినిమా రచయితగా కూడా పేరుగాంచారు. శ్రీరాజరాజేశ్వరీ ఫిలింకంపెనీ అధినేత కడారు నాగభూషణం ఆదరణతో వారి చిత్రాలు సతీసుమతి (1941) సతీ సక్కుబాయి (1954) శ్రీకృష్ణ తులాభారం (1955) మొదలగు చిత్రాలకు రచయితగా పనిచేశారు. 'సతీసుమతి'లో ఆయన వ్రాసిన నిన్న సాయంత్రమున అనేపాట ఎంతోపేరు తెచ్చిపెట్టింది. ఈయన 'వరవిక్రయం' చలన చిత్రంలో కూడా నటించారు. ఘంటసాల, అక్కినేని వీరిని తరచూ కలుస్తూ ఈయన సలహాలను గైకొనేవారు. 1958లో నిర్మించిన శ్రీరామాంజనేయ యుద్ధం ఇతడు పాటలు సమకూర్చిన చివరి చిత్రం
దైతా గోపాలం రంగస్థలం బయట కూడా చాలా సౌమ్యంగా, సాధువులాగా ఉండేవారు. ఆయన సాధువు పాత్రలు వేయటంలో బాగా రాణించారు. విదురుడు, అక్రూరుడు ఈయనకు బాగా నచ్చిన పాత్రలు. సక్కుబాయి నాటకంలో శివయోగి పాత్రను కూడా ఈయన చిరస్మరణీయం చేశాడు.
వీరు 1958 లో దివంగతులయ్యారు.
★★★★★★★★★★★★★
💐వీరికివే మా నివాళులు..!!💐
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి