★★★★★★★★★★★★★★★
💥 తెలుగునాటకరంగ వైభవం💥 ★★★★★★★★★★★★★★★
నూరేళ్ళ నుండి పండిత పామరులు అలరిస్తున్న.నాటక రాజము,చింతామణి శత వర్ష జయంతి సందర్భాన ఆ కళారూపం సృష్టికర్తయే నేటి మన చిరస్మరణీయులు..
నాటి సాంఘిక దూరచారాలపై మ్రోగించిన యుద్ధభేరి....
శ్రీ నారాయణరావు కాళ్ళకూరి...
ప్రసిద్ధ నాటక కర్త,
ప్రథమాంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు
సంఘ సంస్కర్త.
ఈయన తూర్పు గోదావరి జిల్లా లోని కాకినాడ మత్స్యపురి గ్రామంలో 1871, ఏప్రిల్ 28 న జన్మించారు. తండ్రి బంగారురాజు, తల్లి అన్నపూర్ణమ్మ. సంఘంలో వేళ్ళూనిన పలు దురాచారాలను ఎలుగెత్తి ఖండిచారు. వీరి రచించిన నాటకాలలో చింతామణి (1921), వర విక్రయం (1923), మధుసేవ (1926) బాగా ప్రసిద్ధిచెందినవి. వీటిని చాలా మంది నాటకాలుగా ప్రదర్శించారు. తెలుగు సినిమాలుగా కూడా నిర్మించబడి మంచి విజయం సాధించాయి.
1919 లో రాసిన
"పద్మవ్యూహం"
ఈ నాటకంలో సంభాషణలు పద్యాల రూపంలో వ్రాసారు .
"వరకట్నం".
వరకట్నం దురాచారాన్ని నిరసిస్తూ కాళ్లకూరి వారు రచించిన నాటకం. ఎంతో ప్రాచుర్యమున్న నాటకం. ఇది లీలాశుకుని చరిత్ర. ఆనాటి కాకినాడ వేశ్యల గుట్టుమట్లు ఆ నాటకంలో బట్టబయలు చేశారు. ఈ నాటకం ఎన్నో సార్లు ప్రదర్శిత మైంది. .
ఆనాడు ఈ నాటకం ప్రదర్శించని నాటక సమాజమంటూలేదు. ఈ నాటకంలోని పద్యాలు ప్రజల నోటిలో తాండవించాయి. సంస్కార భారతి వారు ఈ నాటకాన్ని ఇటీవల కాలం వరకు ప్రదర్శించారు.
.
"చింతామణి"
ఈ నాటకం వేశ్యావృత్తికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న కాలంలో రాయబడింది. వేశ్యావృత్తిని నిరసిస్తూ కాళ్లకూరి వారి రచన ఈ నాటకం. ఈ నాటకం బహుళ ప్రాచుర్యం పొందింది. నేటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
"మధు సేవ"
మద్యపానం వలన కలిగే దుష్పరిణామాలను ఎత్తి చూపిన నాటకం.
" చిత్రాభ్యుదయము"
ఇది రాజరాజ నరేంద్రుని కుమారుడని పేర్కొనే సారంగధరునికీ, చిత్రాంగికీ నడుమ జరిగిన కథ.
ఇతర రచనలు ...
పద్మవ్యూహం (1919) సంసార నటన (1974 కళలో ధారవాహికగా ప్రచురితం) మొదలైన నాటకాలు....
కారణంలేని కంగారు (1920), దసరా తమాషాలు (1920), లుబ్ధగ్రేసర చక్రవర్తి (1906), రూపాయి గమ్మత్తు (1920), ఘోరకలి (1921), మునిసిపల్ ముచ్చట్లు (1921), విదూషక కపటము (1921) వంటి ప్రహసనాలు రచించారు.
ఈయన 1927, జూన్ 27న మరణించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి