28, అక్టోబర్ 2020, బుధవారం

శ్రీ ఆడబాల

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★

 శ్రీ అడబాల
(కందిమళ్ల సాంబశివరావు)
 నటులు, రూపశిల్పి, 
లలిత కళా సమితిలో స్థాపక సభ్యులు, 
రంగస్థల అధ్యాపకులు.
ఈయన 1936, ఫిబ్రవరి 9 న తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సత్యమ్మ, వెంకన్ననాయుడు.

నాటకరంగానికి రూపశిల్పిగా సుపరిచితులు. ఆ శాఖలో లోతుపాతులు కూలంకషంగా, శాస్త్రీయ పద్ధతులలో అధ్యయనం చేసి నైపుణ్యం సంపాదించారు. జాతీయ స్థాయిలో నాటక విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఆహార్యంలో మెళకువలు బోధించారు. సీనియర్ మేకప్ ఆర్టిస్టులలో ఆడబాల ముఖ్యులు. 
ఈయన బి.ఏ పట్టభద్రుడు. 
డాక్టర్ గరికపాటి రాజారావు వద్ద నటనలోను, ఆదర్శ నాట్యమండలి, పాలకొల్లుకి చీఫ్ మేకప్ ఆర్టిస్టు అయిన మెషక్‌ వద్ద మేకప్‌లోనూ శిక్షణ పొందాడు.

అడబాల బాల్యదశ నుండే నాటకాల్లో వేషాలు వేశారు. విద్యార్థి దశలో భమిడిపాటి 'ఇప్పుడు' అనే నాటికలో శానయ్య పాత్ర ధరించి శభాష్ అనిపించుకున్నారు. 1940 నుంచీ పినిసెట్టి శ్రీరామమూర్తి నిర్వహించిన ఆదర్శ నాట్యమండలి పక్షాన ప్రదర్శించిన పల్లెపడుచు, అన్నాచెల్లెలు తదితర నాటకాల్లో పాల్గొన్నారు. 
మద్రాస్ లో రైల్వేశాఖ ఉద్యోగం.
కె. వేంకటేశ్వరరావు శిక్షణలో ర.స.న సమాఖ్యలో 'ఫణి, రాగరాగిణి' వంటి ప్రతిష్ఠాత్మక నాటకాలలో పాల్గొన్నారు. పలుచోట్ల ఉత్తమ నటుడిగానూ, 
హాస్య నటుడిగానూ బహుమతులు అందుకున్నారు. 

1966లో సికింద్రాబాద్ వచ్చిన అడబాల 1967లో ఆంధ్ర లలిత కళాసమితిని స్థాపించిన వ్యవస్థాపక సభ్యులలో ఒకరయ్యారు. ఎ.ఆర్. కృష్ణ ఆధ్వర్యంలో చాలా నాటకాల్లో పాల్లొన్నారు. అందులో ముఖ్యమైనది 'మాలపల్లి. నేరము- శిక్ష, కప్పలు, నీలా తెరలు, లేపాక్షి, ఆశ్రయం, అరణి, వీలునామా' మొదలైన నాటకాలు, 'మానవుడు, పెళ్ళిచూపులు, పగ, అమ్మ, రాజీవం, రాతిమనిషి 'మొదలైన నాటికలు నటుడిగా అడబాలకు పేరు తెచ్చాయి.

 అడబాల కొన్ని టీవీ సీరియల్స్‌లో, అగ్నిప్రవేశం, స్టూవర్టుపురం పోలీస్ స్టేషను మొదలైన చిత్రాల్లో కూడా నటించారు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి విజిటింగ్ ఫాకల్టీగా చేశారు. ఉస్మానియా, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని రంగస్థల కళల శాఖలో విజిటింగ్ లెక్చరర్ గా పనిచేశారు. ఈయన శిక్షణలో అనేక మంది శిష్యులు ఆహార్యంలో నైపుణ్యం సంపాదించారు.

ఆదర్శ నాట్యమండలి నాటకాలకు అప్పట్లో మేకప్ చేస్తున్న మాస్టారు అడబాల అసక్తిని గమనించి, మేకప్ లో తొలి పాఠాలు నేర్పి ప్రోత్సహించారు. ఆనాటి నుండి అటు నటన, ఇటు రూపశిల్పం రెండీంటినీ నిర్వహిస్తూ వచ్చారు.

నటుడిగా30 నాటకాల్లో నటించినా,
రూపశిల్పిగా రమారమి నాలుగు వేల
నృత్య,నాటక ప్రదర్శనకు మేకప్ చేసి,
రంగస్థలంతో దాదాపు ఆరుదశాబ్దాల అనుబంధం పెనవేసుకొన్న ఈయన,
ఆహార్యంలో  అగ్రతాంబూలం అందుకొన్న వీరు,
మార్చి 14, 2013న మరణించారు.
      (సేకరణ-నూలు)
★★★★★★★★★★★
💐వారికివే మా నివాళులు..!!💐
★★★★★★★★★★★

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి