19, అక్టోబర్ 2020, సోమవారం

శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
వీరు గుంటూరు జిల్లా లింగాయపాలెంలో జన్మించారు. మన జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులైనారు. పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యానంతరం నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడినాడు. ప్రజానాట్యమండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. ఆంధ్ర ప్రభలో 400 మంది నటీనటుల జీవితాలను 'నటరత్నాలు' శీర్షికగా వ్రాశారు. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు.

1982లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
1949లో కేఎస్ ప్రకాశ రావు దీక్షతో మొదలై బాలకృష్ణ సినిమా భైరవద్వీపం వరకూ 400లకు పైగా తెలుగు చిత్రాల్లో నటించారు.

ఐదుసార్లు జైలుకు వెళ్లిన స్వాతంత్య్రయోధుడూ- కమ్యూనిస్టు. గ్రంథాలయ, హేతువాద ఉద్యమాలలో క్రియాశీల కార్యకర్త, నాటకరంగ నటుడు, ‘ఆంధ్రుల నటరత్నాలు’ తదితర రచనలను చేసినవాడు, ప్రజానాట్య మండలి వ్యవస్థాపక సభ్యుడు, ‘తెలుగువారి జానపద కళారూపాలు’ గ్రంథ రచయిత. ‘మన పగటి వేషాలు’, ‘ఆంధ్రుల నృత్యకళావికాసం’ తదితర పరిశోధనాత్మక గ్రంథ రచయిత. ఎనభై ఏళ్లనాడు భార్యను నాటక రంగానికి పరిచయం చేసిన ప్రజా కళాకారుడు. జీవించి ఉన్న వాళ్లల్లో ఆయనతో పోల్చదగిన వారు అరుదు! గుంటూరు జిల్లా లింగాయపాలెంలో 1914 జూలై 7న జన్మించారు మిక్కిలినేని. అయినవాళ్లు నష్టజాతకుడ న్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కోలవెన్నులో అమ్మమ్మ గారి ఇంట ఆయన బాల్యం పాదుచేసుకొంది. కపిలవాయి రామనాథ శాస్ర్తి శిష్యరికంలో ‘మిక్కిలినేని’ ఇంటిపేరుగల వారికి గర్వకారణంగా మానులా బహుముఖంగా ఎదిగి, మంగళవారం ఫిబ్రవరి 22, 2011 తేదీన మంగళవారం తెల్లవారు సుమారు మూడు గంటలకు మిక్కిలినేని విజయవాడలో తన 95వ ఏట మరణించారు. కొన్ని రోజులుగా, మూత్ర సంబంధమైన, అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలోని ఆసుపత్రిలో మరణించారు. "మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మరణంతో జీవించి వున్న తెలుగు సినీ కళాకారుల్లో తానే పెద్ద" అన్నారు డా. అక్కినేని నాగేశ్వరరావు. నిజమే. నాయక పాత్రలు-అనామక పాత్రలు అనే సినీ కొలమానంతో ‘అక్కినేని ఎక్కాల్సిన మెట్లూ-మిక్కిలినేని దిగాల్సిన మెట్లూ లేవు’ అనే వాడుక లోని చమత్కారమూ నిజమే.

మిక్కిలినేని వంటి నూనూగు మీసాల కుర్రాళ్లను అప్పటి సంక్షుభిత సమాజం రాటుదేల్చింది. అంతర్జాతీ యంగా ఫాసిస్టులకు, దేశీయంగా బ్రిటిష్-నైజాం నియం తృత్వానికి, ఆంధ్ర ప్రాంతంలో జమీందారీల అణచివేతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుపార్టీ రూపొందించిన కళాసైన్యం ప్రజానాట్యమండలి. ఆ వాతావరణంలో భార్య సీతా రత్నాన్ని మిక్కిలినేని నాటక రంగానికి పరిచయం చేశారు. ఏడు దశాబ్దాల క్రితం ఎంతటి ముందడుగో!

పల్నాటియుద్ధం-బొబ్బిలియుద్ధం-కాటమరాజు కథ తదితర 30 చారిత్రక-జానపద కళారూపాల ద్వారా ప్రజలను సమీకరించిన ప్రజానాట్యమండలి 1940లలో నిషేధానికి గురైంది. ఫలితంగా కొందరు సినీరంగాన్ని ఆశ్రయించారు. వారిలో కేబీ తిలక్, తాతినేని ప్రకాశరావు, గరికపాటి రాజారావు, సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, సి.మోహనదాసు, టి.చలపతిరావు, వి.మధుసూదనరావు, మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి వంటి ముఖ్యులున్నారు.

వీరిలో నాటకరంగం నేపథ్యంగా సినీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఎందరో ఉన్నారు. నాటకరంగాన్ని విడవని నాగభూషణం వంటి నటులూ ఉన్నారు. నాటక రంగానికి చెందిన 400 మంది కళాకారులను ‘నటరత్నాలు’ శీర్షిక ద్వారా తెలుగు పాఠకులకు పరిచయం చేసిన ప్రత్యేకత మిక్కిలినేనిదే! వీధినాటకాలు-జముకుల కథలు-బురక్రథలు ప్రదర్శిం చిన పాత రోజులను మరవకుండా, పాత స్నేహితాలను పునరావిష్కరించుకుంటూ తెలుగునేల నాలుగు చెరగులా తిరిగి స్వయంగా తెలుసుకున్న సమాచారంతో ‘ఆంధ్ర నాటకరంగ చరిత్ర’ రచించారు. డక్కికథ అనే పేరు నుంచి బురక్రథ అనేపేరు వచ్చిందని తన రచనలలో మిక్కిలినేని వివరించారు. అరవపల్లి సుబ్బారావు, ఆరణి సత్యనారాయణ, దేవతాసుబ్బారావు, నరసింహగుప్త, రెంటచింతల సత్యనారాయణ, భీమప్ప శ్రేష్టి, వంకాయల సత్యనారాయణ, రేపల్లె వెంకటశేషయ్య తదితర నటులు తమవారని తెలుసుకున్నామని, మిక్కిలినేని పరిశోధనలకు వైశ్యప్రముఖులు నివాళి పలికారు. వివిధ సామాజిక వర్గాలు తమ వారి వేర్లను/పేర్లను గుర్తించేందుకు ఉపకరించాయి మిక్కిలినేని రచనలు.

సినీజీవితంలో ప్రవేశించేముందు మిక్కిలినేని వెటర్నరీ సైన్స్‌లో డిప్లొమా చేశారు. ఆయన కుమారుడు డా.విజయకుమార్ వెటర్నరీ వైద్యులుగా పదవీ విరమణ చేయడం గమనార్హం! మిక్కిలినేనికి ఇరువురు కుమార్తెలు.

రచనలు సవరించు
నటరత్నాలు (1980, 2002)
ఆంధ్ర నాటకరంగ చరిత్ర
తెలుగువారి జానపద కళారూపాలు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 1992.
ప్రజా పోరాటాల రంగస్థలం
ఆంధ్రుల నృత్య కళావికాసం
తెలుగువారి చలన చిత్ర కళ
నటించిన సినిమాలు సవరించు
శాంతినివాసం (1986)
పులి బెబ్బులి (1983)
రామ్ రాబర్ట్ రహీమ్ (1980)
గంధర్వ కన్య (1979)
చిరంజీవి రాంబాబు (1978)
దాన వీర శూర కర్ణ (1977) .... Bheeshma
సీతా కళ్యాణం (1976) .... జనకుడు
ఆడదాని అదృష్టం (1974)
బాల భారతం (1972) .... ధృతరాష్ట్రుడు
మావూరి మొనగాళ్ళు (1972)
సంపూర్ణ రామాయణం (1971) .... జనకుడు
బాలరాజు కథ (1970)
గండర గండడు (1969)
ప్రేమకానుక (1969)
దేవకన్య (1968)
కలిసొచ్చిన అదృష్టం (1968)
శ్రీకృష్ణావతారం (1967) .... ధర్మరాజు
పల్నాటి యుద్ధం (1966) .... కొమర్రాజు
అంతస్థులు (1965)
సి.ఐ.డి. (1965) .... రామదాసు
పాండవ వనవాసం (1965) .... దుశ్యాశనుడు
బభ్రువాహన (1964) .... ధర్మరాజు
మంచి మనిషి (1964)
పూజాఫలం (1964)
రాముడు భీముడు (1964)
నర్తనశాల (1963) .... ధర్మరాజు
తిరుపతమ్మ కథ (1963)
లక్షాధికారి (1963)
బందిపోటు (1963)
పరువు ప్రతిష్ఠ (1963)
శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) .... బలరాముడు
మహామంత్రి తిమ్మరుసు (1962)
గులేబకావళి కథ (1962)
గుండమ్మ కథ (1962) .... జమిందారు
దక్షయజ్ఞం (1962) .... బ్రహ్మదేవుడు
కులగోత్రాలు (1962) .... చలపతి
జగదేకవీరుని కథ (1961) .... ఇంద్రుడు
శ్రీ సీతారామ కళ్యాణం (1961) .... జనకుడు
రేణుకాదేవి మహత్యం (1960)
పెళ్ళి మీద పెళ్ళి (1959)
అప్పుచేసి పప్పుకూడు (1958)
మాయా బజార్ (1957) .... కర్ణుడు
సారంగధర (1957)
తెనాలి రామకృష్ణ (1956) .... కనకరాజు
సంతానం (1955)
పరివర్తన (1954)
మేనరికం (1954)
కన్నతల్లి (1953)
పుట్టిల్లు (1953)
పల్లెటూరు (1952)
పల్నాటి యుద్ధంలో కొమ్మరాజుగా నటించిన మిక్కిలినేని అనే కళావృక్షంలో సినీ జీవితం ఒక కొమ్మ మాత్రమే!

1999లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం పొందారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి