17, అక్టోబర్ 2020, శనివారం

శ్రీ పనారస(సురభి) గోవిందరావు

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
తెలుగు జాతికి నవరసాల "#సురభి"ని పంచిన #వనారస...!!
వినోదాలతో జాతికి ఆనందాన్ని అందించిన భరోసా...!!
శ్రీ వనారస గోవిందరావు   కడప మండలము హానుమథ్గుండము అనుగ్రామమున తోట బలిజ వంశమునన..గంపరామన్న, పకీరమ్మ దంపతులకు కడు పేద కుటుంబంలో జన్మించారు. వీరి పెంపుడు తలిదండ్రులు సుంకమ్మ, వెంకోజీరావులు. గోవిందరావు అసలు పేరు పకీరప్ప. పెంపుడు తలిదండ్రులు పెట్టిన పేరు గోవిందప్ప. అదే గోవిందరావుగా మారింది.
ఆంధ్ర నాటక కళాపరిషత్తు వ్యవస్థాపక సభ్యులతో వనారస గోవిందరావు, 1929
శ్రీ గోవిందరావు
వెంకోజీరావు గారి దగ్గర సంగీతం, ఫేడేలు, నంద్యాల జ్యోతి సుబ్బయ్య కంపెనీలో చేరి పాటలు నేర్చుకున్నారు. ఆ కంపెనీలో వేసిన మొదటివేషం సత్యహరిశ్చంద్రలోని విశ్యామిత్రుడు.
మద్రాసులో నాటకాలను చూసిన గోవిందరావు తను కూడా స్టేజి నాటకాలు వేయాలని అనుకొని, సురభి గ్రామంలో కీచకవధ నాటకం ప్రదర్శించారు. అందులో గోవిందరావు నకులుడి పాత్ర ధరించారు. తరువాత కాలంలో  ‘శ్రీ శారదా మనో వినోదినీ సభ’ అనే నాటక సమాజాన్ని స్థాపించి, స్టేజి నాటకాలు వేయడం ప్రారంభించారు. ఆ సభే నేటి సురభి కంపెనీలకు మాతృసంస్థ.
తరువాత కంపెనీని సంచాల నాటక రంగంగా రూపొందించి, సంచారానికి పనికివచ్చే రేకులు, విద్యుత్ దీపాలు, వైర్ వర్క్ సామాగ్రి సంపాదించి పెద్దఎత్తున్న వివిధ ప్రాంతాలలో నాటక ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. రంగూన్ లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. స్త్రీలు నాటకాలలో నటించకూడదని అంటున్నకాలంలో తన భార్యాబిడ్డలను నాటకాలలో నటింపజేసి, సురభి నాటక సమాజాన్ని నాట్యశాస్త్ర విహిత సమాజంగా తీర్చిదిద్దారు.
1917లో భీమవరంలో అంకాదహనం నాటకంలో ఆంజనేయ పాత్రలో నటిస్తుండగా గోవిందరావు ధరించిన దుస్తులకు నిప్పంటుకొని దేహం కాలిపోయింది. నాటకాలలో నటించడానికి పనికిరాని పరిస్థితి ఏర్పడింది. అయినా కానీ సమాజాన్ని వదిలిపెట్టలేదు. హస్యం చేప్పేవారు. కాంతామణి నాటకంలో దొంగవేషం వేసి అద్భుతంగా నటించేవారు. అందుకే నాటక ప్రదర్శన కరపత్రాలలో ‘కంపెనీ ప్రొప్రెయిటర్ చే దొంగవేషం ధరింపబడును’ అని అచ్చు వేసేవారు.
1929నాటికే ఆంధ్రదేశంలో నాటకకళ క్షీణదశ ప్రారంభమైందని గ్రహించి దానిని సరైన మార్గంలో పెట్టడానికి పెద్దలతో కలిసి ఆంధ్ర నాటక కళా పరిషత్తు స్థాపించారు. ఆ సమయంలోనే ఆ పరిషత్తు ఆయనకు ‘ఆంధ్రనాటక కళోద్ధారక’ బిరుదుతో సన్మానించింది.
చివరిదశలో ఏలూరు దగ్గర పొలసనపల్లిలో స్థిరనివాసం ఏర్పరుచుకొని చాలా దానధర్మాలు చేశారు.ఈ గ్రామము బీమడోలు నుండి చిన్న తిరుపతి వెళ్లే మార్గములో ఉన్నది... ఆ ఊరి పాఠశాల శ్రీ గోవిందరావు గారి దాతృత్వానికి గుర్తు గా మిగిలి ఉంది..ఆ గ్రామములో వీరి శిలా ప్రతిమ నెలకొల్పారు కళాభిమానులు... ఎన్నో గొప్ప కళారూపాలు ప్రదర్శించే థియేటర్ , ఏలూరు లో కల YMH హాలు నందు వీరి ప్రతిమ ఇప్పటికి మనల్ని పులకరిస్తుంది .. ఆయన శిలా విగ్రహాన్ని కళాకారులు ఏలూరులో ప్రతిష్ఠించారు.
ధరించిన పాత్రలు
విశ్వామిత్రుడు, నకులుడు, ఆంజనేయుడు, దొంగ, అర్జునుడు (సుభద్ర), రాజరాజ నరేంద్రుడు, హరిశ్చంద్రుడు, అనిరుద్ధుడు, రావణుడు, శ్రీరాముడు (సంపూర్ణ రామాయణం), విక్రమార్కుడు, బిల్వ మంగళుడు, జగన్మోహనుడు, హిరణ్యకశిపుడు, రుక్మాంగదుడు.
తన పూర్తి జీవితాన్ని నాటకరంగానికి, నాటకోద్ధరణ కోసం ధారపోసిన  శ్రీ వనారస... ౼(వికీపీడియా సౌజన్యంతో)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి