19, అక్టోబర్ 2020, సోమవారం

పువ్వుల రామతిలకం

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★
చద్రబింబంలాంటి మంచి అందమైన వర్చస్సుగల మోము... అద్భుత హావభావాలు..వాచకం,పాట పద్యాలు చక్కని శృతితో శ్రావ్యంగా పాడటం.. మెరిసే చూపులు...వయ్యారపునడక...వీటన్నిటినీ కలగలిపి ఊహిస్తే కదిలే అందాల బొమ్మే పువ్వుల రామతిలకం...
అలనాటి ఆంధ్ర యువకుల హృదయ స్పందన...ఈమె సినిమా విడుదల రోజుల్లో గ్రామసీమలనుండి జనం కుటుంబం మొత్తం తో...
ఆహారపు ఏర్పాట్లతో చిరుదిళ్లులాంటి వాటితో, తాంబేటీకాయ మరచెంబులతో మంచినీళ్లు..పెట్టుకొని ఎడ్ల బండ్ల పై బారులు తీర్చి...పట్టణంలో ఉన్న సినిమా హాల్ కు వచ్చి చూచి...తెల్లవారి మరల తిరుగుప్రయానం చేసేవారు..ఈ సంఘటన అనుభవాన్ని మొత్తం మనసులో ప్రతిష్టించు కుని..నెమరవేసుకుంటూ కబుర్లు చెప్పుకునే వారు...
ఆరోజుల్లో విడుదల అయిన ఒక సినిమా ఇంచుమించు దక్షిణ భారతదేశంలో
అత్యంత ఆదరం పొందింది. అదే ""సావిత్రి"" చిత్రం...
1932లో, కలకత్తాలో ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించిన సావిత్రి చలన చిత్రం..సావిత్రి పాత్రలో పువ్వుల రామతిలకం జీవించింది..ఆ మరుసటేడే మదన్ ఫిలిమ్ కంపెనీ నిర్మించిన ""చింతామణి""సినిమాలో చింతామణిగా పేక్షకుల మనసులు దోచుకొంది..వేల్ పిక్చర్స్ ""కృష్ణ లీలలు""చిత్రంలో ఆమె యశోదగా నటించి,
ప్రేక్షకుల మనస్సులలో యశోదగా నిలచిపోయింది.."కలయో వైష్ణవ మాయయో"  అనే బమ్మెర పోతన గారి పద్యం ఆమె నోటివెంట ఎంత మధురంగా వినిపించిందంటే.. ఆ తరువాత మూడు దశాబ్దాల వరకూ..తెలుగు వారి ఇళ్ళలో ఆ పద్యం వినబడేదట.

ఇంతటి కీర్తి ప్రతిష్టలు పొందిన పువ్వుల రామతిలకం జన్మించినది మన బెజవాడ లోనే .
సుప్రసిద్ధ మృదంగ విద్వాంసులైన పువ్వుల వెంకట రత్నం గారు వీరి తండ్రి.
సంగీత విద్వాంసులైన పువ్వుల నారాయణ గారి దగ్గర ఈమె సంగీతం నేర్చుకొన్నారు.ఆమె గాత్ర మాధుర్యానికి కరిగిపోయిన మైలవరం కంపెని మానేజర్ కొమ్మూరు పట్టాభి రామయ్యగారు ఆమెకు తన లక్ష్మి విలాస సభలో అవకాశం కల్పించడం..అక్కడే ఆమె గొప్ప పేరు ప్రతిష్టలు ఆర్జించడం జరిగింది.
ఆ తరువాత గొప్ప నటులు,నిర్వాహకులైన కపిలవాయి రామనాధ శాస్త్రి గారి 
బాల భారతీ నాట్య మండలిలో చేరడం..తద్ద్వారా ఎన్నో గొప్ప పాత్రల్ని పోషించే అవకాశం,అదృష్టం ఆమెకు లభించాయి.

శ్రీ కృష్ణ లీలలు,శ్రీకృష్ణ తులాభారం,సతీ సక్కుబాయి,చింతామణి వంటి అనేక 
నాటకాలలో నటించి గొప్ప కీర్తి పొందింది..కాలం మారింది.సినీ ప్రపంచంలో నేపధ్య సంగీత ప్రాధాన్య పెరిగింది..తమ పాట తామే పాడుకోవడానికి ప్రాధాన్యత తగ్గడం ఆరంభమైంది..దానితో రామతిలకం క్రమంగా సినీ రంగానికి దూరమవక తప్పలేదు...

అపారమైన కీర్తి ప్రతిష్టలను స్వంతం చేసుకొన్న రామతిలకం తిరిగి తన గూటికే చేరవలసి వచ్చింది..బెజవాడలోనే ఆమె 14-3-1952న 47 ఏళ్ల వయసులోనే ఈ  లోకాన్ని వీడింది..

"జాతస్య మరణం ధ్రువం."..కానీ కళాకారులు మరణించినప్పటికీ జనహృదయాలలో జీవిస్తా రణదానికి ..
నేను నేడు ఆమె పై వ్యాసం వ్రాయడం...
మీలాంటి రసజ్ఞులైన పాఠకలు చదవడం...      (-నూలు)
★★★★★★★★★★★💐ఆ మహా నట కిదే మా నివాళులు..!!💐
★★★★★★★★★★★

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి