17, అక్టోబర్ 2020, శనివారం

శ్రీ నందిరాజు నారాయణమూర్తి

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
శ్రీ నందిరాజు నారాయణమూర్తి  
ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు మరియు నాటక ప్రయోక్త.

 నటనాచార్య, కళాతపస్వి, ఆంధ్రశివాజీ బిరుదాంకితులు.
★జననం - 
నారాయణమూర్తి 1934, జూలై 31 న వెంకట్రామయ్య, బాలా త్రిపురసుందరి దంపతులకు తెనాలి జన్మించాడు. బి.ఏ. పూర్తిచేశారు.

★వివాహం - ఉద్యోగం 
నారాయణముర్తి గారి మొదటి భార్య పేరు శ్రీమతి కుసుమ. ఆవిడ పరమపదించక సుప్రసిద్ద నాటక నటిమణి జ్యొతి గారిని వివాహం చేసుకున్నారు. ఆయనకు నలుగురు కొడుకులు. ఆయన వి.డి.ఓ.గా ప్రభుత్వ ఉద్యోగం చేశారు. ఆయన ఉద్యోగంలో ఉంటూ, నాటక రంగంలో విశేష సేవలు అందించారు.

★నాటకరంగ ప్రస్థానం
శ్రీ నారాయణమూర్తి తన 12వ ఏట వీలునామా అనే హాస్యనాటికతో రంగస్థలంలోకి ప్రవేశించారు. ప్రసిద్ధ నటులు అబ్బూరి వరప్రసాదరావు, ముదిగొండ లింగమూర్తి ల సాహచర్యంతో అభినయంలో మెళకువలను నేర్చుకున్నారు. 1976లో అబ్బూరి కళా పరిషత్తు ప్రారంభించారు. కృష్ణాజిల్లా గుడివాడ లో స్థిరనివాసం ఏర్పాటుచేసుకొని అనేక నాటకాలను ప్రదర్శించారు. సుమారు 70 నాటకాలకు దర్శకత్వం వహించిన నందిరాజు పౌరాణికాలలో ప్రతినాయక పాత్రలను ఏరి కోరి ఎంచుకుని వాటితోనే మంచి గుర్తింపును సాధించాడు. నట దంపతులుగా నారాయణమూర్తి, జ్యోతిలు నాటకరంగానికి ఎనలేని సేవ చేశారు. సినిమాలో నటించమని ఆదుర్తి సుబ్బారావు కోరినా నాటకరంగంలో ఉండడానికే ఇష్టపడ్డారు. వేమూరి రామయ్య చుండూరు మధుసూదనరావు, ఎ.వి.సుబ్బారావు, ఆచంట వెంకటరత్నం నాయుడు, గుమ్మడి గోపాలకృష్ణ, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, బి.ఎన్. సూరి వంటి ప్రసిద్ధ నటులతో కలిసి నటించారు.
★నటించిన నాటకాలు 
వీలునామా
కులం లేని పిల్ల
కూలి పిల్ల
పునర్జన్మ
ఇన్స్ పెక్టర్ జనరల్
భయం
వీలునామా
బాలనాగమ్మ
రామదాసు
మోహినీ భస్మాసుర
సీతారామ కళ్యాణం
వారసత్వం
వెంకన్న కాపురం
పల్లెపడుచు
ఉద్యోగ విజయాలు
కురుక్షేత్రం
★నటించిన పాత్రలు
దుర్యోధనుడు
దుశ్శాసనుడు
రావణబ్రహ్మ
మైరావణుడు
హిరణ్యకశ్యపుడు

అనేక నాటక సమాజాలకు కార్యవర్గ సభ్యులుగా పనిచేసిన శ్రీ నందిరాజు 2006లో  పరమపదించారు..
★★★★★★★★★★★★★★★★★★
       💐💐 వారికి మా నివాళులు...!!💐💐★★★★★★★★★★★★★★★★★★
        (సేకరణ:నూలు)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి