మీరు తెలుగువారా ...!!!.తెలుగు భాష అన్నా తెలుగు పద్య నాటకమన్నా..సాంఘిక నాటకమన్నా ఎంతో ఇష్టమా ..!!??తెలుగు నాటకం అంతరించిపోతుందని ఆవేదనపడుతున్నారా....!!అయితే మీరు తెలుగునాటకం నేస్తమే..!!తెలుగునాటకాన్ని సింహావలోకనం చేద్దాం రండి ....తెలుగునాటక వికాసాన్నిఆకాంక్షిద్దాం....రండి...గత వైభవాన్ని వీక్షించండి ..!!
19, అక్టోబర్ 2020, సోమవారం
నాటకం ఓ గొప్ప ప్రక్రియ. మహాకవి కాళిదాసు నాటకాన్ని “చాక్షూషమైన యజ్ఞం” అని గౌరవించాడు. యజ్ఞం చేసే ఋత్విక్వుల వంటివాడు నటుడు. అందరూ సుఖంగా భార్యాపిల్లలతో నిద్రపోయే ఎన్నోరాత్రులు, నటీనటులు నాటకనిర్మాణంలో, వ్యయపరచి, తమ సుఖాన్ని సంతోషాన్ని వదలుకొని, చెప్పలేనంత కష్టాన్ని, చెప్పుకోలేనంత శ్రమను ధారపోస్తారు. అప్పుడే ఓ నాటకం పుడుతుంది. పుట్టినబిడ్డను పదిమందికీ చూపించడానికి, పది ఊళ్ళూ తిరుగుతారు. చివరికి జనులా ప్రదర్శన చూసి, చప్పట్లు కొడితే ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతారు నటులు. ఎందుకోసం ఇదంతా? ఎవరికోసం ఇదంతా? ఈ జనం కోసమే. ఈ జనానందం కోసమే. అలా తమని తాము కొవ్యొతిలా కరిగించుకొంటూ, లోకానికి వెలుగునిచ్చే, నిస్వార్థ జీవులు కళాకారులు...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి