★★★★★★★★★★
🎭
💥 *తెలుగు*💥
*నాటకరంగ వైభవం*
★★★★★★★★★★
ఈనాటి మన చిరస్మరణీయులు...
శ్రీ కిళాంబి కృష్ణమాచార్యులు
రంగస్థల నటులు, దర్శకులు , నాట్యాచార్యలు
★జననం
శ్రీ కృష్ణమాచార్యులు 1900, మే 5న ధర్మాచార్యులు...చూడమాంబ దంపతులకు జన్మించారు.
★నాటకరంగ ప్రస్థానం...
పండితుల కుటుంబం కనుక కృష్ణమాచార్యులుకు సంగీత సాహిత్యాలు వంశపారంపర్యంగా వచ్చాయి. చిన్నతనంలోనే ఆరాధనోత్సవాలలో పాటలు పాడుతూ సంగీతాన్ని అభివృద్ధి పరుచుకున్నారు. అంతేకాకుండా, నాటక లక్షణ గ్రంథాలు చదివి నాటకకళలో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. చిన్న వయసులోనే కాకినాడకు వెళ్లి, వెదురుమూడి శేషగిరిరావు, ముప్పిడి జగ్గరాజు, ఆలమూరు పట్టాభిరామయ్య మొదలైన మహానటులతో కలిసి నటించడమేకాకుండా, అనకాపల్లి లోని లలితా సమాజం ప్రదర్శించిన ప్రదర్శనలలో నటించారు. 1917లో లలితా సమాజానికి కొంతకాలం ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. నటులకు శిక్షణ ఇవ్వడంలో తగిన ప్రతిభ కలవారు. ఈయన శిక్షణలో రూపొందిన నటులు నాటక, సినీరంగాలలో రాణించారు. ఈయన నాటక కృషిని గుర్తించి ఆంధ్ర నాటక కళా పరిషత్తు 1950లో ఘనంగా సన్మానించింది.
★దర్శకత్వం చేసినవి ...
అనార్కలి
చాణక్య
ఆంధ్రశ్రీ
వేనరాజు
కురుక్షేత్రం
★నటించిన పాత్రలు...
శ్రీరాముడు
శ్రీకృష్ణుడు
కంసుడు
రుక్మాంగదుడు
విశ్వామిత్రుడు
ధర్మరాజు
భవానీ శంకరుడు
బిల్వమంగళుడు
>లింగరాజు
శర్మ (మధుసేవ)
అక్బర్
భరతుడు
దుర్యోధనుడు<,>అర్జునుడు
1957లో కృష్ణమాచార్యులుకు చక్కెర వ్యాధి రావడంతో కుడికాలు తొలగించవలసివచ్చింది.
వీరు1959, జూలై 27న శివ సాన్నిధ్యం పొందారు.
★★★★★★★★★★★
💐వీరికివే మా నివాళులు..!!💐
★★★★★★★★★★★
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి