9, నవంబర్ 2020, సోమవారం

శ్రీ పిల్లలమర్రి సుందరరామయ్య

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★

ఈనాటి మన చిరస్మరణీయులు తొలి తరం రంగస్థల నటులు... *శ్రీ పిల్లలమర్రి సుందరరామయ్య*
 రంగస్థల నటులు
★జననం
 శ్రీ సుందరరామయ్య 1895లో గుంటూరు జిల్లా, తెనాలి లో  కుమారస్వామి, శేషమాంబ దంపతులకు  జన్మించారు.

★రంగస్థల ప్రస్థానం 
 నాటకరంగంపై చిన్నప్పటినుండి ఆసక్తివున్న శ్రీ సుందరరామయ్య నటననే వృత్తిగా తీసుకుని ,పూర్తి కాలపు ప్రధాన పాత్రధారిగా తెనాలి రామవిలాస సభలో   చేరారు. అక్కడ గోవిందరాజులవెంకటసుబ్బారావు, 
పెద్దిభొట్లవేంకటాచలపతి మాధవపెద్ది వెంకటరామయ్య, పులిపాటి వెంకటేశ్వర్లు, , స్థానం నరసింహారావు, ముదిగొండ లింగమూర్తి తదితర ఉద్దండ కళాకారులు  సుందరరామయ్య గారికి సహచర నటులు గా ఉండేవారు.

★నటించిన పాత్రలు
జనార్ధనమంత్రి;నారదుడ;రాంసింగ్;హరిశ్చంద్రుడు;పాపారాయుడు;భీముడు;నరకాసురుడు;రుక్మాంగదుడు;బిల్వమంగళ;రాజరాజనరేంద్రుడు;విశ్వామిత్రుడు;సుదేవ;అశ్వత్థామ

★మరణం ..
ఈయన 1933లో నటరాజులో ఐక్యం చెందారు.
★★★★★★★★★★★
💐వారికివే మా నివాళులు..!!💐        (-నూలు)
★★★★★★★★★★★

7, నవంబర్ 2020, శనివారం

శ్రీ ఎస్.కె. ఆంజనేయులు

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★

ఈనాటి మన చిరస్మరణీయులు
*శ్రీ ఎస్.కె. ఆంజనేయులు*
 ప్రముఖ రంగస్థల నటులు, రచయిత, దర్శకులు
★జననం
శ్రీ ఆంజనేయులు 1925, ఏప్రిల్ 8న జన్మించారు.
★వుద్యోగం
  నిజాం స్టేట్ రైల్వేలో 1945లో ఉద్యోగంలో చేరారు.

"★రంగస్థల ప్రస్థానం 
1952లో లక్ష్మీపతి సహకారంతో హైదరాబాద్ లో విశ్రుతీ నాట్యమండలిని స్థాపించి అనేక నాటకాల్ని ప్రదర్శించారు..
సాంఘిక, చారిత్రక, పౌరాణిక నాటకాలలో నటించి, దర్శకత్వం చేపట్టిన ఆంజనేయులు, 1962లో సారంగధర నాటకానికి దర్శకత్వం వహించి అనే ప్రదర్శనలు చేశారు
1955 నుంచి వందకుపైగా నాటక పరిషత్తులకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
. 1987లో ఆంధ్రజ్యోతి నిర్వహించిన నాటిక రచనా పోటీలలో రాధికా స్వాంతం నాటికకు ప్రథమ బహుమతి, విశాఖ సాహితీ సేవా సమితి ట్రస్ట్ నిర్వహించిన నాటక రచనల పోటీలలో స్మృతి ప్రతీక నాటికకు తృతీయ బహుమతి అందుకున్నారు.  
★నటించిన నాటకములు
రాగరాగిణి:పవిత్రులు;చావకూడదు;నీడలు-నిందలుశిరోమణి
వలయం;ఆత్మీయులు

2005, సెప్టెంబర్ 11 న హైదరాబాద్ శివసాయుజ్యం పొందారు..
★★★★★★★★★★
💐వారికివే మా నివాళులు..!!💐    (సేకరణ -నూలు)
★★★★★★★★★★

6, నవంబర్ 2020, శుక్రవారం

శ్రీ ఆవేటి నాగేశ్వరరావు

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★
నేటి మన చిరస్మరణీయులు..
*శ్రీఆవేటి నాగేశ్వరరావు* దర్శకులు.రంగస్థల నటులు, , నటరాజేంద్ర, నాట్య కళాధురీణ బిరుదాంకితులు.ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులు, 

*జననం - విద్యాభ్యాసం*.
నాగేశ్వరరావు వెంకటస్వామి, అంజనమ్మ దంపతులకు 1914, ఆగస్టు 1 న జన్మించారు.స్కూల్ ఫైనల్ పరీక్షలో ఉత్తీరుడయ్యారు.భీమవరం, గుంటూరులలో విద్యను అభ్యసించారు. 
*రంగస్థల ప్రస్థానం* ..
నాగేశ్వరరావుది నాటక కళాకారుల కుటుంబం. చదువుకుంటున్న రోజులలోనే వంశానుగతమయిన నాటకకళ అభిరుచితో, తనతోటి వాళ్లతో నాటకాలు వేసేవారు. తండ్రి నేతృత్వంలో 1934, సెప్టెంబర్ 4న కుటుంబమంతా కలిసి ప్రదర్శించిన తులాభారం నాటకంతో రంగస్థలంపై అడుగుపెట్టారు. ఆవేటి పూర్ణిమనాగేశ్వరరావు,  నాయకా నాయిక పాత్రలలో అనేక నాటకాలు ప్రదర్శించారు పూర్ణానంద థియేటర్స్ పేరుతో  క 1943లో  నాగేశ్వరరావు న్యూ సమాజం స్థాపించారు. క్షణంలో దృశ్యం మారడానికి వీలయ్యే ట్రాలీ స్టేజీని మొట్టమొదటగా నాగేశ్వరరావే ప్రవేశపెట్టారు. సురభి నాటక కళా సంఘం స్థాపించడంతో పాటు సురభి సప్తతి స్వర్లోత్సవాలు జరిపి, ప్రత్యేక సంచి) ప్రచురించారు.
రాజు (బలిదానం)
శ్రీకృష్ణదేవరాయులు
దుర్యోధనుడు
మాయల మరాఠిరామదాసు
శ్రీరాముడు
హరిశ్చంద్రుడు


తెనాలి వర్తక సంఘం నాగేశ్వరరావు దంపతులకు కనకాభిషేకం చేసి, నవరత్నహారం బహూకరించింది.
1959లో బాపట్ల విజ్ఞాన సమితి నాగేశ్వరరావుకు నట రాజేంద్ర అనే బిరుదునిచ్చి సన్మానించింది.

గాలివీడు గ్రామంలో సువర్ణ ఘంటాకంకణం బహూకరించారు
బలిదానం, శ్రీకృష్ణదేవరాయలు నాటకాలు ప్రదర్శనకు కావాలసిన లైటింగ్ మొదలైన పరికరాలు కొనుక్కోవడానికి భారత ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం లభించింది
శ్రీ  1967, సెప్టెంబర్ 26 న నాగేశ్వరరావు దివంగతులయ్యారు
★★★★★★★★★★
💐వారికివే మా నివాళులు..!!💐(సేకరణ-నూలు)
★★★★★★★★★★

5, నవంబర్ 2020, గురువారం

శ్రీ అక్కి వెంకటేశ్వర్లు

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★

అక్కి వెంకటేశ్వర్లు 
తెలుగు రంగస్థల నటులు.
జననం
వెంకటేశ్వర్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలంలోని నారికేలపల్లెలో జన్మించారు.

రంగస్థల ప్రస్థానం 
శ్రీవెంకటేశ్వర్ల యొక్క గాత్రం రమ్యంగా ఉండేది.వెంకటేశ్వర్ల యొక్క గాత్రం రమ్యంగా ఉండేది.ప్రాథమిక విద్య పూర్తి చేసిన వెంకటేశ్వర్లు విద్యాభ్యాసం ముందుకు సాగలేకపోయింది.  ఆ గ్రామంలో ఉన్న ప్రముఖ రంగస్థల నటులు కొమరువోలు హనుమంతరావు వెంకటేశ్వర్ల గాత్రం విని నాటకరంగంలోకి ఆహ్వానించారు.

నవయువక నాట్యమండలి (చుండూరు) లోను, వల్లూరి వెంకట్రామయ్య చౌదరి సమాజంలోను, ఇతర నాటక సమాజాల వారి నాటకాలలో నటించారు.
ఒకవైపు వ్యవసాయం చేసుకుంటూ నాటకరంగంలో  నటించేవారు.. 

నటించిన నాటకాలు .. పాత్రలు 
కురుక్షేత్రం - అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ
రామరావణ యుద్ధం - ఆంజనేయుడు
తులనీ జలంధర - శంకరుడు
గయోపాఖ్యానం - ధర్మరాజు
సీతారామకల్యాణం - విశ్వామిత్రుడు
సన్మానాలు 
చుండూరు, తెనాలి, గుంటూరు, నెల్లూరు, చిలకలూరి పేట, అన్నవరం, చేబ్రోలు, నారికేలపల్లె, చిలుమూరు రామూ రూరల్ కాలేజిలో, హైదరాబాద్ త్యాగరాయగాన సభ (10.6.96) లో ఘన సన్మానాలు జరిగాయి.

(సేకరణ-నూలు)

4, నవంబర్ 2020, బుధవారం

శ్రీ గూడూరు సావిత్రి

చలన చిత్ర రంగంలో  నాయక పాత్రలో,ఎంతమెప్పించారో...ప్రతినాయకపాత్రలోనూ అంతే మెప్పించిన ఏకైక నటుడు అన్న ఎన్టీఆర్ ... 

 తెలుగు నాటక రంగంలో సాద్వీమణి సీత పాత్రను... రాక్షస స్త్రీ శూర్పణఖ పాత్రను 
అలాగే సాత్వికమైన చంద్రమతిపాత్రను...రాజసమైన నాయకురాలు నాగమ్మ..అలాగే. రుక్మిణీ...కైక  లాంటి పరస్పర విరుద్ధమైన వైవిధ్య పాత్రలను పోషించి, మెప్పు పొందినదీ రంగస్థల నటీమణి.... 
ఆమే ఈనాటి మన చిరస్మరణీయురాలు...
శ్రీ గూడూరు(ఆవేటి) సావిత్రి

అందమైన రూపం.
మధురమైన గాత్రం... 
శ్రావ్యమైన స్వరం...
స్పష్టమైన పలుకులు...
నిరాడంబరత్వం...
వృత్తియెడల భక్తి...
మృదుస్వభావం...
 సమయపాలన..
అంకితభావం...
సహానటులయెడల సృహృదభావ వైఖరి...
నిగర్వం..లాంటి సద్గుణాలు ఆమె ను నాటకరంగంలో ఉన్నత శిఖరాలలో నిలిపాయనడంలో సందేహం లేదు.

ప్రశాంతమైన,నిర్మలమైన వదనం... 
కన్నుల్లో కనిపించే  ఆత్మీయత... 
పెదవులపై పలకరించే చిరుదరహాసం,... 
ఎన్ని కీర్తి ప్రతిష్టలు పొందినా....
 ఏ మాత్రం  మచ్చుకైనా కానరాని
అతిశయం...అహంకారం... 
చూడగానే ఆమె పై గౌరవభావాన్ని.. కలిగిస్తాయి...
 
1950 లో ఎనిమిదేళ్ల ప్రాయంలోనే బాల పాత్రలతోనే పేరుతెచ్చుకున్నసావిత్రి గారు, యుక్తవయస్సు రాగానే స్త్రీ,పురుష పాత్రలను అలవోకగా -అద్వితీయంగా
అనితరసాధ్యంగా పోషించి,ప్రేక్షకులను మంత్రముగ్ధులను గావించి,నటిగాఉన్నత శిఖరాలను 
అధిరోహించారు.

గూడూరు సావిత్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఆవేటి సావిత్రి ప్రముఖ రంగస్థల నటీమణి.

★జననం
ఈమె నారాయణరావు,
అంజనీదేవి దంపతులకు 1942 సంవత్సరములో కడపజిల్లా కస్తూరీ రాజుగారి పల్లెలో జన్మించారు.
★బాల్యం
తన ఐదవ యేటనే న్యూ పూర్ణానందా డ్రమేటిక్ థియేటర్ అనే  సురభి నాటక సమాజంలో సత్య హరిశ్చంద్ర నాటకంలో లోహితాస్యుడు పాత్ర తో నాటకరంగ ప్రవేశం చేశారు..
 నెల్లూరు జిల్లా గూడూరు
ప్రాంతంలో నివసించడం వల్ల 
గూడూరు సావిత్రిగా ప్రసిద్ధి చెందింది.
 శ్రీ సాయన ప్రకాశరావు ఈమె రంగస్థల గురువు. 
బాల్యంలో,శ్రీకృష్ణ లీలల్లో కృష్ణుడు, కనకతారలో కనకసేనుడు, తార, ,లవకుశ లో లవుడు, కుశుడు, భక్తప్రహ్లాద లో ప్రహ్లాదుడు,  మొదలగు పాత్రలు ధరించారు.

తరువాత కాలంలో..
సులోచన, తార, మీరాబాయి, సక్కుబాయి, శూర్పణక, కైక, అహల్య,ద్రౌపది, మండోదరి, శశిరేఖ,  వాసవి, లీలావతి, చింతామణి,చంద్రమతి, బాలనాగమ్మ, నాయకురాలు నాగమ్మ, సీత, లక్ష్మి, రుక్మిణి, , రాధ, శకుంతల మొదలగు పాత్రలు ధరించారు.

భరణి ఆర్టు థియేటర్ అనే నాటక సమాజాన్ని స్థాపించి, తాను , ఆ సంస్థకు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తూ, ఆ సంస్థలోని నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించేవారు. ఇతర సమాజాలలో నటించడంతో పాటుస్వంత 
నాటకాలను ప్రదర్శించారు.

★నాటకాలు - పాత్రలు 
బాల్య దశలోనే కనకతారలో కనకసేనుడు, తార, శ్రీకృష్ణ లీలలు ల్లో కృష్ణుడు, భక్తప్రహ్లాద లో ప్రహ్లాదుడు, లవకుశలో లవుడు, కుశుడు మొదలగు పాత్రలు ధరించారు. చంద్రమతి, బాలనాగమ్మ, నాయకురాలు నాగమ్మ, సీత, లక్ష్మి, రుక్మిణి, ద్రౌపది, మండోదరి, శశిరేఖ, సులోచన, తార, మీరాబాయి, సక్కుబాయి, శూర్పణక, కైక, అహల్య, వాసవి, లీలావతి, చింతామణి, రాధ, శకుంతల మొదలగు పాత్రలు ధరించారు. మరెన్నో సాంఘిక, చారిత్రక నాటకాల్లోనూ వైవిధ్యభరితమైన పాత్రలు ధరించిన ఈవిడ పురుషపాత్రలను కూడా పోషించి, తన నటనా వైద్యుష్యాన్ని వెల్లడించారు. కృష్ణుడు, రాముడు, సత్యవంతుడు, కార్యవర్థి, బిల్వమంగళుడు మొదలగు పురుష పాత్రలు ధరించారు.

 పౌరాణిక పద్యనాటకాల్లో పలు ప్రధాన పాత్రలను పోషించి ప్రసిద్ధి చెందిన సావిత్రి గారు ప్రారంభంలో ఎన్నో సాంఘిక నాటకాల్లోనూ నటించారు.
ప‌రువుకోసం,నటరాజు, పునర్జన్మ, తుఫాను, తరంగాలు, దొంగలొస్తున్నారు జాగ్రత్త,ఎదురీత,పల్లెపడుచు,అన్నాచెల్లెలు,చీకటిదొంగలు,ఎండమావులు,కమల,
పెదవులు-పదవులు, 
మేనరికం, రాజీవం ,మొదలగు 
సాంఘిక నాటకాలలో 
తననటనా కౌశలాన్ని,
ప్రదర్శించారు.
 
అలనాటి నాటక రంగంలో లబ్ధ ప్రతిష్టులైన ఉద్దండనటులు సర్వశ్రీ షణ్ముఖి ఆంజనేయ రాజు, బేతా రామచంద్రారావు, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, చీమకుర్తి నాగేశ్వరరావు, అబ్బూరి వరప్రసాదరావు,వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, ఆచంట వెంకటరత్నం నాయుడు, వేమూరి రామయ్య, అమరాపు సత్యనారాయణ, కె. రఘురామయ్య, పులిపాటివెంకటేశ్వర్లు,ఎ.వి.సుబ్బారావు, 
డి.వి. సుబ్బారావు, బండారు రామారావు, వేమూరి రామయ్య , రేబాల రమణ, కాగిత సుబ్బారావు, వేమూరి గగ్గయ్య  పొన్నాల రామసుబ్బారెడ్డి, వై. గోపాలరావు, మద్దాలరామారావు,మొదలగు నట ప్రముఖుల సరసన వారికి దీటుగా నటించి ప్రశంసలందుకున్నారు.

 మూడు తరాల నటులయిన  తాత, తండ్రి, మనవడు అయిన వేటపాలెం డి.వి. సుబ్బారావుగారితో, వారి కుమారుడు వెంకట సుబ్బయ్య గారితో, మనవడు డి.వి. సుబ్బారావు గారితో ‘చంద్రమతి’గా అనేక ప్రదర్శనలు చేశారు.

ఈమె పలు పరిషత్తు పోటీలలో శతాధికంగా ‘ఉత్తమనటి’ బహుమతులందుకున్నారు. 

★అవార్డులు - సత్కారాలు
అవార్డులు ఈమెను వరించటమే వాటికి రివార్డుగా భావించేవి అనుటలో అతిశయోక్తి లేదేమో..

సినీనటి సావిత్రి అవార్డు, జమున అవార్డు,
స్థానం నరసింహారావు అవార్డు, 
ఆం.ప్ర.. ప్రభుత్వం వారిచే కళారత్న అవార్డు,
పైడి లక్ష్మయ్య అవార్డు, 
హంస అవార్డు,  , కృష్ణకుమారి అవార్డు, 
దక్షిణ మధ్య రైల్వేవారి లింకా అవార్డు మరెన్నో అవార్డులు ఈమెను వరించి తరించాయి.

సన్మానాలు...సత్కారాలు...
పురస్కారాలు...
కనకాభిషేకాలు..సువర్ణ హస్త కంకాణాలు,
పట్టు వస్త్రాలు...పట్టు శాలువాలు...
రజితపతకాలు...జ్ఞాపికలు...
ఒకటా.. రెండా,,ఎన్నో,,మరెన్నెన్నో.....
నాటకరంగంలో  అత్యంత గౌరవం పొందినదీ విదూషణిమణి..

మహానటి,అభినయ శారద, అభినవ శారద, కళాతపస్విని, సరస నయానాభినేత్రి,  మొదలగు బిరుదులను పొందారు.

సాయికృష్ణ యాచేంద్ర  వెంకటగిరి వారిచే సువర్ణ హస్త ఘంటా కంకణం,
విజయవాడ పురప్రముఖులచే కనకాభిషేకం, సువర్ణహస్త ఘంటా కంకణం, , 
నంద్యాల నంది పైపుల అధినేత ఎస్.పి.వై. రెడ్డి గారిచే బంగారు పతకం, 
పొదిలి పురప్రముఖులచే బంగారు పతకం, 
బీహార్ గవర్నర్ పెండేకంటి వెంకటసుబ్బయ్య, 
ఆంధ్రా గవర్నర్ కృష్ణకాంత్, 
ఆంప్ర. ముఖ్యమంత్రులు డా. ఎన్.టి. రామారావు, 
నారా చంద్రబాబునాయుడు తదితర రాజకీయ ప్రముఖులు ఈమె ప్రతిభను వివిధ రీతుల  సత్కరించారు.  
అంతేకాకుండా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం కూడా అందుకున్నారు.

డి.వి. సుబ్బారావు గారితో (వేటపాలెం) తో శతాధికంగా ‘సత్యహరిశ్చంద్ర’ నాటక ప్రదర్శనల్లో చంద్రమతిగా నటించడమేకాక, వారి కాంబినేషన్ లో గ్రామ్‌ఫోన్ రికార్డు కూడా ఇచ్చారు.చీమకుర్తి నాగేశ్వరరావు హరిశ్చంద్రుడిగా, ఈవిడ చంద్రమతిగా, అలాగే శ్రీకృష్ణతులాభారంలో పృథ్వి వెంకటేశ్వర్లు నారదుడిగా, ఈవిడ కృష్ణుడుగా గ్రామ్‌ఫోన్ రికార్డు,  సి.డి.లు వెలువడినాయి. 

ఆకాశవాణిలో ఎన్నోపౌరాణిక నాటకాల్లో నటించిన ఈమె సినిమాల్లో, టి.వి. సీరియల్స్ లోనూ,  నటించారు.

పసి ప్రాయంలో తన 5 వయేట  నాడు లోహితాస్యుడుగా  అడుకుంటూ కట్టెలు కోసం అడవికెళ్లే పాత్రతో  నాటకరంగంలో కాలుమోపిన ఈ చిన్నారి పాప...  తదుపరి ఆరు దశాబ్దాలు సుదీర్ఘ నాటక రంగ ప్రస్థావనలో నాటక రంగంలో ఎన్నెన్నో వైవిధ్యమైనపాత్రలను,వాటి మూల స్వభావాన్ని,పాటలనూ,
పద్యాలనూ,రాగాలనూ.సంభాషణలనూ,అత్యంత ధారణ ప్రతిభతో తన మెదడు లో నిక్షిప్తం చేసుకుని,నటననూ,  నాటకాన్ని,,ఆహారహారం,,,ఆద్యంతమూ,,ప్రేమిస్తూ..ఆలోచిస్తూ,,ఆరాధిస్తూ..ఆవాహనచేస్తూ,,.ఆపోసనపడుతూ,...అనుభవిస్తూ.. రంగస్థలంపై ఆడుకుంటూ...అభినయిస్తూ,,
ఆలపిస్తూ,,అనుభూతి చెందుతూ...ఆనందిస్తూ...
ఆనందింపచేస్తూ...అభినందింపచేస్తూ..అశేష ఆంధ్రప్రేక్షకుల అత్యంత అభిమానం,ఆదరణలను 
పొందిన  అసమాన నటీమణి గా పేరుగాంచి, ..జాతస్య మరణం ధృవం... అని రుజువు చే సి 0-1-2012 న శివసాయుజ్యం పొండినదని
చెప్పక తప్పడం లేదు
 ఓం శాంతి... శాంతి...శాంతి...
★★★★★★★★★★★★★
ఆ మహా నటీమణి కివే మా నివాళులు...!!💐💐
★★★★★★★★★★★★★

..

 .

3, నవంబర్ 2020, మంగళవారం

శ్రీ అల్లు రామలింగయ్య

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★

ఆయనదేమో పాలకొల్లు...
ఆంధ్రదేశానికి ఆయనో హాస్యపు విరిజల్లు..
ఎవరు...!!ఇంకెవరు..!!
ఆయనే మన రామలింగయ్య అల్లు..ఆయనే నేటి మన చిరస్మరణీయులు..

తెలుగు చిత్రసీమలో ఏమీ కానీ స్థాయి నుండి తెలుగు చిత్రసీమలో అంతా నా వారసులే అని చెప్పుకోదగ్గ స్థాయికి చేరిన మహానటుడు.. *శ్రీఅల్లు రామలింగయ్య* ..

 పేరులోనే హాస్యం ఉంది. ఆయన హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. చారిత్రక కాలంలో కవిత్వంలో పలు ప్రక్రియలు చేపట్టి కవ్వించి , నవ్వించి ' వికటకవి గా తెనాలి రామలింగడు చరితార్థుడైతే , ఈనాటి సినీసీమలో అలాంటి స్థాన్నాన్ని పొందినవారు అల్లు రామలింగయ్య .

★బాల్యము
"పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో 1922 అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జన్మించారు. చదువు పెద్దగా అబ్బలేదు. తన సహచరులతో కలసి ఆకతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవారు. ఇదే క్రమంతో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది. ఊళ్లోకి ఎవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారి వెంటే తిరుగుతూ ఉండేవారు. వాళ్లతో స్నేహం చేయడం, ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగడం నిత్యకృత్యంగా చేసుకున్నారు. ఎట్టకేలకు భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. అదీ మూడు రూపాయలు ఎదురిచ్చేట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియకండా వేసారు. నాటకానుభవం పెద్దగా లేకున్నా కొద్దిపాటి నటనావగాహనతో తన వేషం మెప్పించారు. ఆ తరువాత ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసి వాటిని అమ్మి నాటక కాంట్రాక్టరుకు ఇచ్చారు. అలా మొదలైనంది ఆల్లు నట జీవితం.
అల్లు నాటకాల్లో నటిస్తూనే, తన సామాజిక బాధ్యతను గుర్తెరిగి గాంధీజీ పిలుపునందుకుని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్లారు. జైలులో కూడా తోటివారిని పోగేసుకుని నాటకాలాడేవారు. మరోవైపు అంటరానితనంపై పోరు సలిపారు.
★చలనచిత్ర జీవితం
అల్లు నాటకాలు చూసిన గరికపాటి రాజారావు చిత్రసీమలో తొలిసారిగా 1952 లో పుట్టిల్లు చిత్రంలో కూడు-గుడ్డ శాస్త్రి తరహ పాత్రను అల్లుచే వేయించారు. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి ' వద్దంటే డబ్బు ' లో అవకాశం వచ్చింది.
పుట్టిల్లు చిత్రం నిర్మాణకాలంలో తన భార్యా నలుగురు పిల్లలతో మదరాసుకు మకాం మార్చారు. అల్లు తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డారు. మరోవైపు హొమియో వైద్యం నేర్చుకున్న అల్లు ఏమాత్రం తీరిక దొరికినా ఉచితవైద్య సేవలందించేవారు.
ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో నిలద్రొక్కుకున్నారు. అల్లు హాస్యపు జల్లునేకాదు కామెడీ విలనిజాన్ని కూడా బగా రక్తికట్టించారు. అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆణి"ముత్యాలు"గా చెప్పుకోదగ్గవి మూగమనసులు, దొంగరాముడు, మాయా బజార్,ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు, శంకరాభరణం మొదలైనవి వున్నాయి. ముత్యాలముగ్గు సినిమా చిత్రీకరణకు ముందు ఆయన కుమారుడు ఆకస్మికంగా మరణించినా బాధను మనసులో అణుచుకుని షూటింగ్ లో పాల్గొన్న గొప్ప నటులు అల్లు. సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసారు. 1116 చిత్రాల్లో నటించాలనే కోరిక ఆయనకు తీరలేదు. ఆతను అభినయించిన చాల పాటలకు బాలు గళం సరిగా అమరి పోయింది. ' మనుషులంతా ఒక్కటే ' చిత్రంలో 'ముత్యాలు వస్తావా అడిగిందీ ఇస్తావా అనే పాట అప్పట్లో హిట్.
అల్లు రామలింగయ్య నిర్మాతగా గీతా ఆర్ట్స్ బానర్ ని నెలకొల్పి ' బంట్రోతు భార్య ' దేవుడే దిగివస్తే , బంగారు పతకం చిత్రాలను నిర్మించారు. చాలాకాలం తర్వాత అల్లు 90 దశకంలో ' డబ్భు భలే జబ్బు ' చిత్రం తీసాడు. రేలంగి, రమణారెడ్డి, కుటుంబరావు, బాలకృష్ణ వంటివారి కాలంతో మొదలు ఈతరం హాస్యనటులు వరకూ కొనసాగిన ఏకైక హాస్యనటులు అల్లునే. ' ఆమ్యామ్య.. అప్పుం అప్పుం ' లాంటి ఊతపదాలు అతను సృష్టించినవే.
పురస్కారాలు, సన్మానాలు
యాబైయేళ్లపాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ తెలుగు ప్రజానీకాన్ని అలరించిన అల్లును వరించిన సన్మానాలు, గౌరవాలు, , అవార్డులు అసంఖ్యాకమైనవి. భారత ప్రభుత్వం 1990 లో ' పద్మశ్రీ ' అవార్డు తో గౌరవించింది. రేలంగి తరువాత ' పద్మశ్రీ' అందుకున్న హాస్యనటుడు అల్లునే.
2001 వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత ' రఘుపతి వెంకయ్య ' అవార్డు ఇచ్చింది. పాలకొల్లులో ఆయన విగ్రహం నెలకొల్పారు. తన కోడుకు అల్లు అరవింద్ నిర్మాతగా స్థిరపడటం, అల్లుడు చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడం, మనవడు అల్లు అర్జున్ హీరోగా మారడం అయనకు జీవితం లో సంతృప్తినిచ్చిన అంశాలు. అతని చివరి చిత్రం 'జై '
వీరు జూలై 31 వ తేదీన తన 82 వ ఏట కన్నుమూసారు. మరణించేనాటికి తెలుగు చిత్రసీమలో అల్లురామలింగయ్యది ప్రత్యేక స్థానం. అతను భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన హాస్యం చిరంజీవిగా మనల్ని అలరిస్తూనే ఊంటుంది. 2013లో భారత చలనచిత్ర పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలయిన 50 తపాలాబిళ్ళలలో ఒకటి అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం విడుదలయింది.
★★★★★★★★★★★★
ఆంధ్రదేశానికి చార్లీ చాప్లిన్లా నవ్వుల్లో ముంచిన..నవ్వులు పంచిన... ఆ మహనీయునుకి మా నివాళులు...!!💐     (-నూలు)
★★★★★★★★★★★

2, నవంబర్ 2020, సోమవారం

శ్రీ వంగర..( వంగర వెంకట సుబ్బయ్య)

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★

5 అడుగుల చిలుకు ఎత్తు..
పూజారి పంచెకట్టు..
నుదిటిపై నిలువు బొట్టు
ఒంటిపైన ఉత్తరీయం...
చేతిలోకర్ర...
 పలికే పలుకుల్లో  స్పష్టత...
తీక్షణమైన కంటి చూపులు.. 
ప్రతిపదాన్ని నొక్కి పలికే మధురమైన ఉచ్ఛారణా మాధుర్యం...
 వెరసి, ఒక సనాతన సత్ బ్రాహ్మణోత్తముని రూపానికి మనసులో పడే ముద్ర...
ఆయనే వంగర..
శ్రీ వంగర వెంకట సుబ్బయ్య..  నాటక రంగాలలో "వంగర" గా ప్రసిద్ధుడైన  రంగస్థల చలన చిత్ర హాస్యనటులు. 
వీరే నేటి మన చిరస్మరణీయులు...

ఏమిటయా నీ లీల.... కృష్ణా...
ఏమిటయా నీ లీలా... 
అనే పాట..గుర్తొచ్చిందా.. !!

సురేష్ పొడక్షన్ వారి "శ్రీకృష్ణ తులాభారం" చిత్రంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో కృష్ణుని నుండి రుక్మిణికి సందేశం చేరవేసే వార్తాహరుని పాత్ర లో వీరి నటన 
న భూతొ...న భవిష్యతి..
వీరే ఈ పాత్రలకు సాటి... 

"మాయా బజార్" సినిమా అల్లు రామ లింగయ్య గారి జోడీగా వీరు పండించిన హాస్యం చెప్పనక్కరలేదు..

 ఈయన ఒంగోలు తాలూకా సంగం జాగర్లమూడిలో 1897, నవంబరు 24 న జన్మించారు.తండ్రిపేరు కోటయ్య...తల్లిపేరు వెర్రెమ్మ...

★రంగస్థల ప్రవేశం
1901 లో 4 ఏండ్ల పసి ప్రాయంలో చిత్రనళినీయం నాటకంతో నాటకరంగ ప్రవేశం చేశారు వంగర..

యుక్తవయస్సులోకొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేశారు.పిదప తెనాలిలో స్థిరనివాసం ఏర్పరచుకుని, స్థానం వారితో చేరి 'శ్రీకృష్ణ తులభారం' నాటకంలో వసంతకుడు వేషం వేసి కళాహృదయుల మన్ననలందుకున్నారు. పిమ్మట రామావిలాస సభలో చేరి,ప్రసిద్ధ నటులు యడవల్లి సూర్యనారాయణ గారితో కలిసి దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నో నాటకాల్లో వేషాలు వేశారు.. వారితో విదేశాలకు కూడా వెళ్లి నాటక ప్రదర్శనలలో పాల్గొన్నారు. ఈయన ఇంకా 'విప్రనారాయణ', 'సక్కుబాయి' మొదలగు నాటకాలలో హాస్య భూమికలను పోషించారు.

★చలనచిత్రరంగ ప్రస్థానం 
1937లో విప్రనారాయణ చిత్రంలో శిష్యుడుగా వేషంవేసి, ఆంధ్ర సినిమా ప్రేక్షకుల మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించారు. తరువాత బాలయోగిని చిత్రంలో ప్రధాన భూమికను పోషించారు. ఈయన ఇంచుమించు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించారు. వీటిలో పెద్దమనుషులు, కన్యాశుల్కం, లక్ష్మమ్మ, ప్రియురాలు, లక్ష్మి, చక్రపాణి, పల్నాటి యుద్ధం, తెనాలి రామకృష్ణ, శ్రీకృష్ణ తులాభారం, గీతాంజలి, మంత్రదండం, పేరంటాలు, శాంతి, సక్కుబాయి ముఖ్యమైనవి.

వీరు 1976లో  శివ సాన్నిధ్యం పొందారు...
★★★★★★★★★★★
💐వారికివే మా నివాళులు..!!💐    (-నూలు)
★★★★★★★★★★★

1, నవంబర్ 2020, ఆదివారం

శ్రీమతి జవ్వాది ఋష్యేంద్రమణి

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★
శ్రీ ఋష్యేంద్రమణి
ప్రముఖ తెలుగు రంగస్థల, చలనచిత్ర నటి...నర్తకి..
అలనాటి ప్రముఖ కథానాయకులకు...తల్లిగా...పెద్దమ్మగా...అక్కగా..అత్తగారిలా  ..సాదుస్వభావ పాత్రలలో నటించి,తన కంఠం లోనూ.. మాటలలోనూ..హావభావములలోనూ చక్కని తెలుగుతనాన్ని చిలికించి,,అచ్చం  మా అమ్మ లాగావుందే..అక్కలాగా ఉందే... మా నానమ్మ లా ఉందే... అని తెలుగు ప్రేక్షకులు సొంతం చేసుకునేటట్లు తనదైన నటనతో రంజింపచేసినది.. కొన్ని చిత్రాలలో గయ్యాళి పాత్రలలో కూడా  గడ గడ
లాడించింది...ఈ సీనియర్ నటీమణి...శ్రీమతి జవ్వాది ఋష్యేంద్రమణి...ఈనాటి మన చిరస్మరణీయురాలు...

ఈమె కృష్ణా జిల్లా విజయవాడ పట్టణములో 1917 సం:లో జనవరి నెల ఒకటవ తేదీన జన్మించింది..
తన 10 వయేటనే రంగస్థల ప్రవేశం చేసిన ఈమె సాంప్రదాయ...క్లాసికల్ సంగీతంతో పాటు కూచిపూడి నాట్యం  కూడా చిన్నతనము నుండీ నేర్చుకున్నది...
కృష్ణ,,ప్రహ్లద పాత్రలతో నట జీవితమును ఆరంభించింది.. తదుపరి కొమ్మూరి పట్టాభిరామయ్య గారి లక్ష్మీ విలాస నాటకసభ లో చేరింది.
శ్రీమతి పువ్వుల రామతిలకం...శ్రీ కపిలవాయి రామనాధశాస్త్రి లాంటి ఉద్దండ నటులవద్ద నటనలో మెరుగులు దిద్దుకుంది...
కొన్ని నాటకాల్లో చింతామణి.. సావిత్రి లాంటి పాత్రలు పోషించింది...
1935సం:లో శ్రీ రాజారావు నాయుడు నిర్మించిన శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ పాత్రలో సినీరంగ ప్రవేశం చేసింది.ఆ చిత్రంలో ఈమె గాయనిగా...నటిగా మంచి ప్రశంసలు పొందినా... చిత్రం ఆర్థికంగా పెద్దగా విజయం పొందలేదు.
తదనంతరం...కడారు నాగభూషణం..
కన్నాంబ గారు స్థాపించిన రాజరాజేశ్వరీ నాట్యమండలి లోచేరి... మూడు సంవత్సరముల పాటూ..తమిళనాడు..కర్ణాటక..మహారాష్ట్ర..ఒరిస్సా..రాష్ట్రాల్లో తిరిగి పలు పాత్రలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. రంగూన్ రౌడీ లో ప్రభావతిగా...పౌరాణిక పాత్రలలో నారదుడు గా...సావిత్రిగా మంచి పేరు సంపాయించుకుంది...
1939 లో ప్రముఖ హార్మోనిస్ట్ జవ్వాది రామకృష్ణ నాయుడిని పెండ్లాడింది.
ఋష్యేంద్రమణి  భర్త జవ్వాది రామకృష్ణారావు "మాతృభూమి" అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడానికి చెన్నై రావడంతో తానుకూడా చెన్నై చేరి "పాండురంగ విఠల్" అనే చిత్రంలో దేవకన్య పాత్ర పోషించింది. అదే సమయంలో గూడవల్లి రామబ్రహ్మం తమిళ పంచ మహాకావ్యాలలో ఒకటైన "శిలప్పాడికరం" ఆధారంగా నిర్మించిన పత్ని చిత్రంలో "కణగి" పాత్ర ధరించింది. ఆ సినిమాలో కోవలన్ పాత్రను తెలుగులో సుప్రసిద్ధ దర్శక నిర్మాత కోవెలమూడి సూర్యప్రకాశరావు ధరించాడు. కణగి పాత్రను ఆమె అత్యద్భుతంగా పోషించింది. ఆ తరువాత "చెంచులక్ష్మిలో" ఆదిలక్ష్మి పాత్ర, "సీతారామ జననంలో" కౌసల్యగాను, సేతుబంధన్ లో ఇంద్రాణిగా, "భక్త సిరియాళలో" కథానాయకి పాత్రను ధరించి మెప్పించారు. ఈమె వీర, రౌద్ర రసాలను ఎంత ఉత్తేజంగా అభినయిస్తుందో, శోకభరిత కరుణారస ప్రధానమైన సాత్విక పాత్రలు కూడా అంతే ప్రతిభావంతంగా పోషించేది. మల్లీశ్వరిలో తల్లి పాత్రనూ, విప్రనారాయణలో వేశ్య పాత్రనూ, మాయాబజార్, జగదేకవీరుడు, అగ్గిరాముడు, కృష్ణ సత్య, పాండురంగ మహత్మ్యం మొదలగు ఘనమైన చిత్రాలలో వివిధ ప్రధాన పాత్రలు పోషించింది.
..
1943 నాటి చెంచులక్ష్మి సినిమాలో ఋష్యేంద్రమణి పాడిన 'నిజమాడు దాన నీదాన" పాట. సినిమాలో ఋష్యేంద్రమణి ఆదిలక్ష్మి పాత్ర ధరించింది.
ఈమె చలనచిత్రాలలోకి వచ్చేప్పటికి, నటీనటులకు వేరేవారు గాత్రంతో పాటలుపాడటానికి సాంకేతిక అభివృద్ధి జరుగలేదు. దాదాపుగా అందరు నటీనటులు తమ పాటలు తామే పాడుకొనేవారు. అదే వరవడిలో, ఋష్యేంద్రమణి తన పాటలను తానే పాడుకొనేది. గాయనిగా మంచి పేరు వచ్చింది. మాయాబజారు సినిమాలో అభిమన్యునితోపాటుగా వళ్తున్నప్పుడు వీరెవరో తెలియక ఘటోత్కచుడు వీరి మీద దాడిజరిపినప్పుడు, ఈమె పాడిన పద్యం ఇప్పటికికూడ ఎంతగానో ప్రజాదరణపొందుతున్న పాత పాటలలో ఒకటి.
దాదాపు దక్షిణాది అన్ని భాషల్లోనూ 150 చిత్రాల్లో నటించిన ఈమె కార్వేటి నగరం మహారాజా గారి చేతుల మీదుగా "మధురగాన సరస్వతి" అనే బిరుదును అవార్డుగా అందుకుంది...
ఈమె తన మనమరాలయిన కన్నడి నటి భవానితో 1974లో" భూతయ్య" అనే కన్నడ చిత్రంలో కలిసి నటించింది..

శ్రీ ఋష్యేంద్రమణి గారు 17 ఆగష్టు 2002 రోజున చెన్నైలో శాశ్వతంగా కన్నుమూశారు.
★★★★★★★★★★★★★
💐ఆమె కివే మానివాళులు...!! (-నూలు)
★★★★★★★★★★★★★