17, అక్టోబర్ 2020, శనివారం

శ్రీ మద్దాల రామారావు

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
నేటి మన చిరస్మరణీయులు శ్రీ మద్దాల రామారావు...
తెలుగు నాటకరంగం లో..
అందునా పౌరాణిక నాటకరంగంలో..సుప్రసిద్ధుడైన నటులు..శ్రీ మద్దాల రామారావు.పౌరాణిక నాటకాలలో..ప్రతినాయకుడి పాత్రకు ఎంతో గౌరవం తెచ్చిపెట్టి..వాటినే నాయక పాత్రలుగా మలిచి..ప్రేక్షకులచేత  బ్రహ్మరథం పట్టించుకొని.. ఎనలేని గౌరవప్రతిష్ఠలు పొందిన..
 గొప్ప నటులు. భీకరాకృతితో...కంచులాంటి కంఠముతో.. గంభీరమైన వాచకముతో...వికటాట్టహాసలలతో... అనితరసాధ్యమైన సుదీర్ఘ సమాసాల ఉచ్చారణ విలాసములతో సాగి భయోప్తాతము కలిగించు ఘర్జనలతో... హావభావములతో సాగే  ప్రతినాయక పాత్రల్లో వీరి నటన చూసియే తీరవలేను..వర్ణింప నసాధ్యము..  మద్దాల రామారావు.ఆంధ్రప్రదేశ్ లోనూ..తెలంగాణలోనే కాదు..పశ్చిమబెంగాల్,
ఒరిస్సా,తమిళనాడు,కర్ణాటకరాష్ట్రాలలోనూ..వందలాది ప్రదర్శనలు ఇచ్చి..ప్రేక్షకులను మెప్పించిన ఘనత వారికే చెందుతుంది.
పశ్చిమగోదావరి జిల్లా..గణపవరం మండలం..
జల్లికొమ్మర లో..6-9-1933న కీర్తిశేషులు మద్దాల వెంకన్న..మహంకాళి దంపతుల..జ్యేష్ఠ పుత్రుడిగా 
జన్మించారు..రామారావు.పెద్దచదువులు చదవకపోయినా..స్వయంప్రతిభతో ఆయన నాటక ప్రస్థానం సాగింది. చాలా చిన్న వయసులోనే కీర్తిశేషులు టేకు సుబ్బారావు నిర్వహించే "లవకుశ"
నాటకంలో లవుడి పాత్రలో తళుక్కున మెరిసారు.
అదొక గొప్ప ముహూర్తం.నాటక రంగంతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది.
కాలక్రమంలో..బాలుడు యువకుడయ్యాడు.
అనుకోకుండా పల్నాటి యుద్ధం నాటకంలో నరసింగరాజు వేషం వేయడం..అందరి దృష్టి అటే నిలవడంతో..మద్దాల వారి అడుగులు ప్రతినాయక పాత్ర వైపే సాగాయి.అప్పుడే సుప్రసిద్ధ నాటకకర్త ..ప్రయోక్త అయిన ప్రగడ భద్రం గారి..తులసి జలంధర నాటకంలో..జలంధరుడిగా
నటించడం ఆరంభం అయ్యింది.అదొక ప్రసిద్ధనాటకం అయ్యింది.దీని తరువాత నాటకం భూకైలాస్.దాని తరువాత భస్మాసుర నాటకం వారికి ఎంతో కీర్తి తెచ్చిపెట్టాయి.ఇక..కురుక్షేత్రం నాటకం గురించి చెప్పాల్సి వస్తే..మద్దాల వారిది దుర్యోధన పాత్ర.కీర్తిశేషులు షణ్ముఖి ఆంజనేయరాజు గారిది..శ్రీకృష్ణ పాత్ర.ఇద్దరు మహానుభావుల్ని అలా వేదిక పైన చూడగలడం నిజంగా అదృష్టమే అని చెప్పాలి..వీరి కి రంగ మార్తాండ బిరుదు కలదు.
తెలుగు పౌరాణిక నాటకాన్ని వెలిగించిన మహానుభావుడు మద్దాల.సినీ రంగంలో  ప్రతినాయకుడు పాత్రల్లో ఎన్టీఆర్...ఎస్వీఆర్ ల్లా ... తెలుగు రంగస్థలములో...శ్రీ మద్దాల వారికీ..శ్రీ ఆచంట వారికీ రారాజుల్లా.. నీరాజనాలు  తెలుగు ప్రేక్షజులు పట్టే రంటే అతిశయోక్తి ఏమాత్రం లేదు ...ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీరిని కళారత్న బిరుదుతో ఘనంగా సత్కరించారు..వీరు తన 85 ఏట.6-2-2017న శివైక్యం పొందారు...
వారి కుమారుడు ఉదయభాను తన తండ్రిగారి.. వారసత్వాన్ని  కొనసాగిస్తున్నారు.

1 కామెంట్‌: