☝️★★★★★★★★☝️
🎭
💥 *తెలుగు*💥
*నాటకరంగ వైభవం*
★★★★★★★★★★
ఈనాటి మన చిరస్మరణీయులు తొలి తరం రంగస్థల నటులు... *శ్రీ పిల్లలమర్రి సుందరరామయ్య*
రంగస్థల నటులు
★జననం
శ్రీ సుందరరామయ్య 1895లో గుంటూరు జిల్లా, తెనాలి లో కుమారస్వామి, శేషమాంబ దంపతులకు జన్మించారు.
★రంగస్థల ప్రస్థానం
నాటకరంగంపై చిన్నప్పటినుండి ఆసక్తివున్న శ్రీ సుందరరామయ్య నటననే వృత్తిగా తీసుకుని ,పూర్తి కాలపు ప్రధాన పాత్రధారిగా తెనాలి రామవిలాస సభలో చేరారు. అక్కడ గోవిందరాజులవెంకటసుబ్బారావు,
పెద్దిభొట్లవేంకటాచలపతి మాధవపెద్ది వెంకటరామయ్య, పులిపాటి వెంకటేశ్వర్లు, , స్థానం నరసింహారావు, ముదిగొండ లింగమూర్తి తదితర ఉద్దండ కళాకారులు సుందరరామయ్య గారికి సహచర నటులు గా ఉండేవారు.
★నటించిన పాత్రలు
జనార్ధనమంత్రి;నారదుడ;రాంసింగ్;హరిశ్చంద్రుడు;పాపారాయుడు;భీముడు;నరకాసురుడు;రుక్మాంగదుడు;బిల్వమంగళ;రాజరాజనరేంద్రుడు;విశ్వామిత్రుడు;సుదేవ;అశ్వత్థామ
★మరణం ..
ఈయన 1933లో నటరాజులో ఐక్యం చెందారు.
★★★★★★★★★★★
💐వారికివే మా నివాళులు..!!💐 (-నూలు)