7, నవంబర్ 2020, శనివారం

శ్రీ ఎస్.కె. ఆంజనేయులు

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★

ఈనాటి మన చిరస్మరణీయులు
*శ్రీ ఎస్.కె. ఆంజనేయులు*
 ప్రముఖ రంగస్థల నటులు, రచయిత, దర్శకులు
★జననం
శ్రీ ఆంజనేయులు 1925, ఏప్రిల్ 8న జన్మించారు.
★వుద్యోగం
  నిజాం స్టేట్ రైల్వేలో 1945లో ఉద్యోగంలో చేరారు.

"★రంగస్థల ప్రస్థానం 
1952లో లక్ష్మీపతి సహకారంతో హైదరాబాద్ లో విశ్రుతీ నాట్యమండలిని స్థాపించి అనేక నాటకాల్ని ప్రదర్శించారు..
సాంఘిక, చారిత్రక, పౌరాణిక నాటకాలలో నటించి, దర్శకత్వం చేపట్టిన ఆంజనేయులు, 1962లో సారంగధర నాటకానికి దర్శకత్వం వహించి అనే ప్రదర్శనలు చేశారు
1955 నుంచి వందకుపైగా నాటక పరిషత్తులకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
. 1987లో ఆంధ్రజ్యోతి నిర్వహించిన నాటిక రచనా పోటీలలో రాధికా స్వాంతం నాటికకు ప్రథమ బహుమతి, విశాఖ సాహితీ సేవా సమితి ట్రస్ట్ నిర్వహించిన నాటక రచనల పోటీలలో స్మృతి ప్రతీక నాటికకు తృతీయ బహుమతి అందుకున్నారు.  
★నటించిన నాటకములు
రాగరాగిణి:పవిత్రులు;చావకూడదు;నీడలు-నిందలుశిరోమణి
వలయం;ఆత్మీయులు

2005, సెప్టెంబర్ 11 న హైదరాబాద్ శివసాయుజ్యం పొందారు..
★★★★★★★★★★
💐వారికివే మా నివాళులు..!!💐    (సేకరణ -నూలు)
★★★★★★★★★★

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి