☝️★★★★★★★★☝️
🎭
💥 *తెలుగు*💥
*నాటకరంగ వైభవం*
★★★★★★★★★★
నేటి మన చిరస్మరణీయులు..
*శ్రీఆవేటి నాగేశ్వరరావు* దర్శకులు.రంగస్థల నటులు, , నటరాజేంద్ర, నాట్య కళాధురీణ బిరుదాంకితులు.ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులు,
*జననం - విద్యాభ్యాసం*.
నాగేశ్వరరావు వెంకటస్వామి, అంజనమ్మ దంపతులకు 1914, ఆగస్టు 1 న జన్మించారు.స్కూల్ ఫైనల్ పరీక్షలో ఉత్తీరుడయ్యారు.భీమవరం, గుంటూరులలో విద్యను అభ్యసించారు.
*రంగస్థల ప్రస్థానం* ..
నాగేశ్వరరావుది నాటక కళాకారుల కుటుంబం. చదువుకుంటున్న రోజులలోనే వంశానుగతమయిన నాటకకళ అభిరుచితో, తనతోటి వాళ్లతో నాటకాలు వేసేవారు. తండ్రి నేతృత్వంలో 1934, సెప్టెంబర్ 4న కుటుంబమంతా కలిసి ప్రదర్శించిన తులాభారం నాటకంతో రంగస్థలంపై అడుగుపెట్టారు. ఆవేటి పూర్ణిమనాగేశ్వరరావు, నాయకా నాయిక పాత్రలలో అనేక నాటకాలు ప్రదర్శించారు పూర్ణానంద థియేటర్స్ పేరుతో క 1943లో నాగేశ్వరరావు న్యూ సమాజం స్థాపించారు. క్షణంలో దృశ్యం మారడానికి వీలయ్యే ట్రాలీ స్టేజీని మొట్టమొదటగా నాగేశ్వరరావే ప్రవేశపెట్టారు. సురభి నాటక కళా సంఘం స్థాపించడంతో పాటు సురభి సప్తతి స్వర్లోత్సవాలు జరిపి, ప్రత్యేక సంచి) ప్రచురించారు.
రాజు (బలిదానం)
శ్రీకృష్ణదేవరాయులు
దుర్యోధనుడు
మాయల మరాఠిరామదాసు
శ్రీరాముడు
హరిశ్చంద్రుడు
తెనాలి వర్తక సంఘం నాగేశ్వరరావు దంపతులకు కనకాభిషేకం చేసి, నవరత్నహారం బహూకరించింది.
1959లో బాపట్ల విజ్ఞాన సమితి నాగేశ్వరరావుకు నట రాజేంద్ర అనే బిరుదునిచ్చి సన్మానించింది.
గాలివీడు గ్రామంలో సువర్ణ ఘంటాకంకణం బహూకరించారు
బలిదానం, శ్రీకృష్ణదేవరాయలు నాటకాలు ప్రదర్శనకు కావాలసిన లైటింగ్ మొదలైన పరికరాలు కొనుక్కోవడానికి భారత ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం లభించింది
శ్రీ 1967, సెప్టెంబర్ 26 న నాగేశ్వరరావు దివంగతులయ్యారు
★★★★★★★★★★
💐వారికివే మా నివాళులు..!!💐(సేకరణ-నూలు)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి